నేడు రాజీవ్‌ గాంధీ వర్ధంతి.. పలువురు నివాళి

Published on 

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 33వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పించారు. కాంగ్రెస్‌ నేతలతో పాటు పలు పార్టీల నాయకులు ఢిల్లీలోని వీర్‌ భూమిలో రాజీవ్‌కు అంజలి ఘటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం మాజీ ప్రధానికి నివాళులర్పించారు. ‘ఈరోజు మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు నా నివాళి’ అంటూ మోదీ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, , పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నాయకులు మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form