ఆరుగురు ఉగ్రవాదులు హతం

Published on 

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ అఖల్‌ మూడో రోజుకు చేరింది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు. ఓ జవాన్‌ గాయపడ్డారు.

కుల్గాం జిల్లాలోని అఖల్‌ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు ఆగస్టు 1న గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య శనివారం రోజంతా కాల్పులు కొనసాగాయాయి. ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరోవైపు ముష్కరుల కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ గాయపడ్డారు. మృతులు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందినవారని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form