నక్సల్స్ అమర్చిన బాంబులను నిర్వీర్యం చేసిన పోలీసులు

Published on 

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోని గడమ్లీ-ఖాదర్ మధ్య నిర్మాణంలో ఉన్న రహదారిపై ఐఈడీ గుర్తించిన పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు.

భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకునేందుకు మావోయిస్టులు భూగర్భంలో మూడూ ఐఈడీలను అమర్చినట్లు పోలీసులు తెలిపారు. సైనికులు అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. రెండు IEDలు ఒక్కొక్కటి ముప్పై కిలోలు, కుక్కర్ బాంబు ఒక్కొక్కటి పది కిలోలు ఉన్నట్లు గుర్తించారు. మూడు బాంబులను కమాండ్ స్విచ్ సిస్టమ్‌కు కనెక్ట్ చేసి రెండు మీటర్ల దూరంలో సిరీస్‌లో అమర్చినట్లు గుర్తించారు. వీటిని BDS బృందం సమక్షంలో IEDలను నిర్వీర్యం చేశారు. నక్సలైట్లు వీధి సోలార్ ప్యానెల్ స్తంభాన్ని కత్తిరించి వాటిలో దీన్ని అమర్చినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form