చండీఘడ్: ఎన్కౌంటర్ కేసులో మాజీ ఎస్పీ పరంజిత్ సింగ్కి పదేళ్ల జైలుశిక్ష విధించింది సీబీఐ కోర్టు. పంజాబ్లోని బియాస్లో ఎస్హెచ్వోగా చేసిన పరంజిత్ సింగ్కు ఈ శిక్ష పడింది. 1993లో ఇద్దరు కానిస్టేబుళ్లను అమృత్సర్లో ఫేక్ ఎన్కౌంటర్ చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో మరో ముగ్గుర్ని దోషులుగా తేల్చింది కోర్టు.
కానిస్టేబుల్ సుర్ముక్ సింగ్, కానిస్టేబుల్ సుఖ్విందర్ సింగ్ను 1993, ఏప్రిల్ 18వ తేదీన పోలీసులు తీసుకెళ్లారు. వాళ్లను అక్రమంగా బంధించి ఆ తర్వాత మజీతా పోలీసులు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను ఫేక్ ఎన్కౌంటర్లో చంపేశారు. నాలుగు రోజుల తర్వాత ఆ ఇద్దరి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
అంత్యక్రియల తర్వాత ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లను కాల్చి వేసినట్లు మజీతా పోలీసు ధరం సింగ్ ప్రకటించారు. ఎన్కౌంటర్ అంశంలో విచారణ అవసరం లేదని పోలీసులు ఆ కేసును క్లోజ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1995, డిసెంబర్ 26వ తేదీన ఈ కేసులో సీబీఐ విచారణ మొదలుపెట్టారు. బాధితుల పేరెంట్స్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దర్ని సుఖ్విందర్, సుర్ముక్గా సీబీఐ విచారణలో తేల్చారు. సుదీర్ఘ కాల విచారణ అనంతరం మాజీ ఎస్పీ పరంజిత్ సింగ్కు పదేళ్ల జైలు శిక్ఝ విధించింది సీబీఐ కోర్టు.
