ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం

Published on 

కాబుల్: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం సంబవించింది. దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన మజార్-ఎ-షరీఫ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకారం.. మజార్-ఎ-షరీఫ్ నగరం ఖుల్మ్ పట్టణానికి సమీపంలో భూమికి 28 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనలు తీవ్ర స్థాయిలో ఉండటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ భూప్రకంపనలకు భారీ భవంతులు ఊగిపోయాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్తులో ఇప్పటి వరకూ పది మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 150 మందికిపైగా గాయపడ్డారు. అయితే, మృతులు వందల్లోనే ఉంటారని యూఎస్‌జీఎస్ అంచనా వేసింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form