బయ్యారంలో ప్రేమికుల ఆత్మాహత్యాయత్నం.. ప్రియురాలు మృతి

Published on 

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డకు చెందిన ప్రవళిక, రవీందర్‌ గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ప్రవళిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. అయితే ఆమె మరణ వార్త తెలుసుకున్న రవీందర్‌.. కత్తితో గొంతు కొసుకున్నాడు. దీంతో స్థానికులు అతడిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎం దవాఖాను తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రవళిక మృతదేహాన్ని మహబూబాబాద్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form