డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అరెస్టు చేశారు. అతన్ని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ సమర్పించిన అభ్యర్థన ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని అతిపెద్ద డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసినట్లు నేహల్ మోదీపై కేసు నమోదు అయ్యింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 సెక్షన్ 3, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 120-B, 201 కింద నేరపూరిత కుట్ర రెండు అభియోగాల కింద అతన్ని అరెస్ట్ చేసినట్లు అమెరికా ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేశారు. భారతదేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణాలలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో నేహల్ మోడీ కీలక నిందితుడు. UKలో అప్పగింత ప్రక్రియను ఎదుర్కొంటున్న అతని సోదరుడు నీరవ్ మోడీకి నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని లాండరింగ్ చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడని భారతీయ ఏజెన్సీలు ఆరోపించాయి. నేహాల్ షెల్ కంపెనీలు, విదేశీ ఆర్థిక మార్గాలను ఉపయోగించి పెద్ద మొత్తంలో అక్రమ డబ్బును దాచడానికి, తరలించడానికి సహాయం చేశాడని, బహుళ భారతీయ చట్టాలను ఉల్లంఘించాడని ED, CBI దర్యాప్తులలో వెల్లడైంది.
జూలై 17న విచారణ
అప్పగింత ప్రక్రియలో తదుపరి విచారణ జూలై 17, 2025న జరగనుంది. ఈ సమయంలో స్టేటస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. నేహల్ మోడీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనిని అమెరికా ప్రాసిక్యూషన్ ఇప్పటికే వ్యతిరేకిస్తుందని పేర్కొంది. PNB కేసుకు సంబంధించి భారత అధికారులు నేహాల్ మోడీపై గతంలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. మల్టీ లేయర్ స్కీమ్ రూపంలో సుమారు రూ.19 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కంపెనీ నుంచి తప్పుడు కారణాలతో డైమెండ్లను తీసుకున్నాడని, కానీ ఆ డీల్ ఎప్పటికీ జరగలేదని ఆరోపణలు వస్తున్నాయి. పేమెంట్ ఒప్పందాలను నేహల్ ఉల్లంఘించాడు. కానీ ఆ డైమెండ్లను తన స్వంత లబ్ధి కోసం అమ్మినట్లు తెలుస్తోంది.
