ఢిల్లీ బీజేపీ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

Published on 

దేశ రాజ‌ధానిలో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాల‌యంలో గురువారం మ‌ధ్యాహ్నం మంట‌లు చెల‌రేగాయి. అగ్నిప్రమాదం కార‌ణంగా కార్యాల‌యం భ‌వ‌నం నుంచి ద‌ట్ట‌మైన పొగ ఆ ప్రాంత‌మంతా వ్యాపించింది. అగ్నిమాప‌క యంత్రాల‌ను ర‌ప్పించిన అధికారులు మంట‌లను అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

సాయంత్రం 4.25 గంటల సమయంలో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంటలు చెలరేగుతుండగా కార్యాలయంలో ఉన్న వారు బయటకు పరుగులు తీశారని చెబుతున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. అయితే ఎవరూ గాయపడలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా, విద్యుత్ షార్ట్‌స‌ర్క్యూట్ కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని భావిస్తున్నారు. ప్రాధ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం అగ్నిప్ర‌మాదానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెలుగుచూస్తాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form