సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్‌..ఒక మావోయిస్ట్ మృతి

Published on 

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్ట్ మరణించినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహంతోపాటు ఒక ఆయుధం, భారీ స్థాయిలో సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

జాగరగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమర్ గట్ట – సింగవరం గ్రామాల సమీపంలోని కొండపై జాగర్‌గుండ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో జూలై 19 రాత్రిన జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రిజర్వ్ గార్డ్స్‌కు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒకరు మరణించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form