EMI కట్టలేని పవన్‌‌కి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి: పోతిన మహేష్‌.

Published on 

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఆస్తుల వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. ఒకనాడు కారుకు EMI కట్టలేని పవన్‌
కళ్యాణ్ ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని వైసీపీ నేత పోతిన మహేష్‌ ప్రశ్నించారాయన. నమ్ముకున్న వాళ్లను అమ్ముకొని తన ఆస్తులను పెంచుకున్నారని విమర్శించారు. జనసేన అధ్యక్షుడు టీడీపీ ఇచ్చిన ప్యాకేజీకి అమ్ముడుపోయిన ప్యాకేజీ స్టార్ అంటూ ఆరోపించారు

పార్టీ ఆఫీసులను కూడా పవన్‌ తన పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నారన్నారు పోతిన మహేష్‌ ఆరోపించారు. మంగళగిరిలో వందకోట్లు పెట్టి బినామీల పేరిట ఆస్తులు కూడా పెట్టుకున్నారంటూ డాక్యుమెంట్లను చూపించారు మహేష్‌. అంత డబ్బు ఎలా వచ్చిందో పవన్‌ లెక్క చెప్పాలని సవాల్‌ విసిరారు. బినామీ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారాయన.

రంగారెడ్డి జిల్లాలోని పవన్‌ కల్యాణ్‌ ఫామ్‌హౌజ్‌ మాటున పెద్ద గూడుపుఠాని వుందన్నారు. అఫిడవిట్‌లో ఆయన చెప్పిన లెక్కకన్నా ఆయన కొన్న భూమి ఎక్కువన్నారు. అంత డబ్బు ఎలా వచ్చిందో పవన్‌ కల్యాణ్‌ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form