కర్నాటక మాజీ ముఖ్యమంత్రికి పోక్సో కేసులో సీఐడీ నోటీసులు

Published on 

కర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు యెడియూర‌ప్ప‌కు పోక్సో కేసులో ఇవాళ విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సీఐడీ నోటీసులు జారీ చేసింది.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఓ 17 ఏండ్ల బాలిక ప‌ట్ల యెడియూర‌ప్ప అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి, లైంగిక వేధింపుల‌కు గురి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బాధిత బాలిక త‌ల్లి మార్చి 14వ తేదీన స‌దాశివ‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును సీఐడీకి అప్ప‌గిస్తూ క‌ర్ణాట‌క డీజీపీ అలోక్ మోహ‌న్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ క్ర‌మంలో యెడియూర‌ప్ప‌కు నోటీసులు జారీ అయ్యాయి. అయితే తాను ఎవ‌ర్నీ కూడా లైంగికంగా వేధించ‌లేద‌ని, ఈ కేసు విష‌యంలో న్యాయ పోరాటం చేస్తాన‌ని యెడియూర‌ప్ప గ‌తంలో ప్ర‌క‌టించారు.

ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న బాధితురాలి త‌ల్లి ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గ‌త నెల‌లో చ‌నిపోయారు. ఈ కేసులో బాధితురాలితో పాటు ఆమె త‌ల్లి వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు న‌మోదు చేశారు. అయితే యెడియూర‌ప్ప ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్నార‌ని, బెంగ‌ళూరు రాగానే సీఐడీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form