కేజ్రీవాల్ సహాయకుడిని ముంబైకి తీసుకెళ్లిన పోలీసులు

Published on 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ను విచారణ నిమిత్తం ముంబైకి తీసుకెళ్లారు ఢిల్లీ పోలీసులు. ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడు బిభవ్‌ కుమార్‌కు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఏడు రోజుల తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయస్థానం ఆయనకు మే 23 వరకు కస్టడీ విధించింది. మరోవైపు ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.

బిభవ్ కుమార్‌ను ముంబైకి తీసుకెళ్లి ఫోన్‌ను ఫార్మాట్ చేసిన ప్రదేశానికి తీసుకువెళతామని ఢిల్లీ పోలీసులు తీస్ హజారీ కోర్టులో పేర్కొన్నారు. దీనికోసం ఆయన్ని ఈ ఉదయం డిల్లీ విమానాశ్రయం నుండి ముంబైకి తరలించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form