OTTలోకి వచ్చేసిన “బస్టర్ ది నక్సల్ స్టోరీ”

Published on 

వివాదాస్పదమైన చిత్రం ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ ఇవాల్టి నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది. ‘ది కేరళ స్టోరీ’ దర్శక-నిర్మాతలు సుదీప్తోసేన్, విపుల్ అమృత్ లాల్ షాలు తెరకెక్కించిన ఈ మూవీలో అదాశర్మ కీలక పాత్ర పోషించింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ zee5 ద‌క్కించుకోగా.. ఈ రోజు నుండి ఈ సినిమా హిందీతో పాటు తెలుగు భాషలలో అందుబాటులోకి వచ్చింది. సన్‌షైన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి బిషక్ జ్యోతి సంగీతం అందించారు.

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. మార్చి 15న రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే కలెక్షన్స్ కూడా అంతగా రాలేదు. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form