నిమజ్జనానికి సర్వం సిద్ధం

Published on 

Hyd: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణేశ్‌ నిమజ్జన కార్యక్రమం సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నెక్లెస్‌ రోడ్డు మార్గంలో పీపుల్స్‌ ప్లాజా, సన్‌ రైజింగ్‌ పాయింట్‌, లేక్‌ వ్యూ పార్‌ బతుకమ్మ కుంట, సంజీవయ్య పార్‌ బేబీ పాండ్‌లలో నిమజ్జన ఏర్పాట్లను అదనపు కమిషనర్‌ రఘు ప్రసాద్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ ఆర్‌ వీ కర్ణన్‌ మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో 20 ప్రధాన లేక్‌లతోపాటు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జనం సాఫీగా చేసేందుకు మౌలిక సదుపాయాలతో పాటు నిధులను జీహెచ్‌ఎంసీ కేటాయించిందని చెప్పారు. నగరంలోని అన్ని ప్రధాన లేక్‌లలో 134 స్థిర క్రేన్‌లు, 259 మొబైల్‌ క్రేన్‌లు ఏర్పాటు చేశామన్నారు.

హైడ్రా, పర్యాటకశాఖ సమన్వయంతో హుస్సేన్‌ సాగర్‌లో 9 బోట్లను, డీఆర్‌ఎఫ్‌ టీంలను, 200 గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. 303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేశ్‌ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేశ్‌ యాక్షన్‌ టీం లను డిప్లాయ్‌ చేశామన్నారు. వేడుకల్లో స్వచ్ఛతకు మిగతా పెద్దపీట వేసేలా 14,486 మంది శానిటేషన్‌ వరర్స్‌ను మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారని కమిషనర్‌ తెలిపారు.

నిమజ్జనం జరిగే ప్రదేశాలతో పాటు ఊరేగింపు జరిగే మార్గంలో మొత్తం 56,187 తాత్కాలిక లైటింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. మూడు షిఫ్టులలో పని చేసేలా అంబులెన్స్‌లతో సహా 7 మెడికల్‌ క్యాంపులను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. రోడ్డు సేఫ్టీ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా 90 శాతానికి పైగా గుంతలను పూడ్చివేశామన్నారు. వర్షాలతో దెబ్బతిన్న మిగతా గుంతలను ఇంజినీరింగ్‌ విభాగం పూడ్చుతుందన్నారు. కాగా, గణేశ్‌ నిమజ్జనం సజావుగా , సాఫీగా జరిగేలా చూస్తున్నామని కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. సకాలంలో గణేష్‌ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాల్సిందిగా కమిషనర్‌ నిర్వాహకులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form