కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

Published on 

AP: ఏపీ పోలీస్ శాఖకు సంబంధించిన కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఫలితాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి అనిత మాట్లాడుతూ కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించామన్నారు. ఫలితాలలో గండి నానాజీ (విశాఖపట్నం) మొదటి స్థానం సాధించగా, రమ్య మాధురి (విజయనగరం) రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానం అచ్యుత రావు (రాజమండ్రి) దక్కించుకున్నారు.

అభ్యర్థులు తమ హాల్ టికెట్ ద్వారా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form