అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలంలో సమన్వయంతో సహాయక చర్యలు తీసుకోవాలని రామ్మోహన్ నాయుడు ఎమర్జెన్సీ టీంలను ఆదేశించారు.
విమానం ప్రమాదం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించానని, అహ్మదాబాద్కు తాను పయనమయ్యానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్లో 242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ (విమానం AI 171) 232 మంది ప్రయాణికులతో బయలుదేరిందని, వీరిలో 10 మంది సిబ్బంది ఉన్నారని మంత్రి చెప్పారు.
