మియామి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. ఇరుదేశాల మధ్య శాంతికి తాను మధ్యవర్తిత్వం వహించినట్లు చెప్పుకొచ్చారు. వాణిజ్య సుంకాలతో ఈ వార్కు బ్రేకులు వేసినట్లు మరోసారి ట్రంప్ చెప్పారు.
మియామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తనను తాను ప్రపంచ శాంతికర్తగా చెప్పుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు చెప్పారు.
అయితే ఈ యుద్ధంలో కూలిన ఫైటర్ జెట్ల సంఖ్యను ట్రంప్ మరింత పెంచారు. ఇప్పటి వరకూ ఏడు జెట్లు కూలిపోయాయని చెబుతున్న ట్రంప్.. ఇప్పుడు ఎనిమిదిగా పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.























