ఇన్‌ఫార్మర్ నేపథ్యంతో ఇద్దరు గ్రామస్తులు హత్య

Published on 

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇద్దరు గ్రామస్తులను నక్సలైట్లు హత్య చేసినట్లు మంగళవారం స్థానిక పోలీసులు తెలిపారు. మృతులు పదమ్ పోజ్జా, పదమ్ దేవేంద్రగా గుర్తించారు. వారు పోలీసు ఇన్‌ఫార్మర్లుగా భావించి మావోయిస్టులు హత్యచేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన కేర్ల పాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సిర్సట్టి పంచాయతీలోని నందా పారాలో జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ కేసును తీవ్రంగా పరిగనిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇటీవల, బీజాపూర్ లోని సిల్గర్‌లో ఇద్దరు తాత్కాలిక టీచర్లను దారుణంగా హత్య చేయడంతో ఆ ప్రాంతంలో ఇప్పటికే భయానక వాతావరణం నెలకొంది. సంవత్సరం కాలంలోనే ఇప్పటివరకు 9 తాత్కాలిక టీచర్లను నక్సల్స్ చంపినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 5 మంది బీజాపూర్ జిల్లాలో, 4 మంది సుక్మా జిల్లాలో హత్యకు గురయ్యారు. అన్ని హత్యల్లోనూ, నక్సలైట్లు వారిని ఇన్ఫార్మర్లుగా ఆరోపిస్తున్నారు. హత్యల వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు జరుగుతోందని. స్థానిక ప్రజలు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form