ఆగస్టు 9 వరకు ఈ రాష్టాల్లో భారీ వర్షాలు…!

Published on 

ఈశాన్య భారతదేశంతో పాటు అనేక రాష్ట్రాల్లో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురియనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేరళ, తమిళనాడులో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఆగస్టు 6-9 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్‎లో.. అస్సాం, మేఘాలయలో ఆగస్టు 4, 7-9 మధ్య భారీ వర్షాలు ఉంటాయి.

ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు నుంచి వచ్చే మూడు, నాలుగు రోజులు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువ వర్షాల ప్రభావం ఉంటుందని వెల్లడించింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form