ఏపీలో 1,800 కోట్ల పెట్టుబడితో పీసీబీ యూనిట్‌

Published on 

AP: దేశంలోనే అతిపెద్ద మల్టీ లేయర్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ (పీసీబీ), కాపర్‌ క్లాడ్‌ లామినేట్‌ (సీసీఎల్‌) తయారీ యూనిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. చెన్నైకి చెందిన సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీస్‌ సంస్థ రూ.1,800 కోట్ల పెట్టుబడితో ఈ తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో దీన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. వచ్చే ఏడాదికల్లా ఇక్కడ యూనిట్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మూలధన రాయితీ, విద్యుత్తు సుంకంపై రాయితీ.. తదితర ప్రోత్సాహకాలు పొందేందుకు ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీస్‌.. దక్షిణ కొరియాకు చెందిన షిన్హూప్‌ ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్యం కోసం చూస్తోంది’ అని ఆ వర్గాలు వివరించాయి.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form