ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 70 శాసనసభ స్థానాలకు ఓకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మీడియా సమావేశంలో భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ మేరకు షెడ్యూల్ను విడుదల చేశారు.
నోటిఫికేషన్ విడుదల తేదీ : జనవరి 10
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: జనవరి 17
నామినేషన్ల పరిశీలన: జనవరి 18
నామినేషన్ల ఉపసంహరణ గడువు: జనవరి 20
పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 5
ఎన్నికల ఫలితాల తేదీ: ఫిబ్రవరి 8