విశాఖలో దారుణం… టీడీపీకి ఓటేశారని దాడి

Published on 

AP: ఏపీలో దాడుల పర్వం కొనసాగుతూనే ఉంది. పల్నాడు, తాడిపత్రి ఘటనలు మరవకముందే విశాఖపట్నంలో మరో దారుణం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగులు ఇద్దరు మహిళలు, ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన చుట్టుపక్కన వాళ్లు ఆసుపత్రిలో చేర్పించారు. విశాఖ నూకాలమ్మ ఆలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి పాల్పడ్డ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కంచరపాలెం పోలీసులు.

అయితే, ఆడవాళ్లని చూడకుండా దాడి చేయడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బును నిరాకరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారని పాశవిక దాడులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసులు ఉదాసీనంగా ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తప్పు చేసిన పోలీసులను శిక్షించాలని డీజీపీని కోరారు చంద్రబాబు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form