వీల్ ఛైర్‌లో వచ్చి ఓటు వేసిన సీఎం తనయుడు

Published on 

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కుమారుడు అనూజ్ పటేల్ (38) వీల్ ఛైర్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనూజ్‌ పటేల్‌ గత సంవత్సరం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురికావడంతో అహ్మదాబాద్‌లోని కేడీ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. అనంతరం ఇవాళ మెరుగైన చికిత్స కోసం అయనను ముంబైలోని హిందూజా ఆస్పత్రికి తరలించారు. దాదాపు నాలుగు నెలల చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి డిచ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆయన మరికొన్ని రోజులు పట్టే అవకాశం వున్న నేపథ్యంలో ఇవాళ తన వ్యక్తి గత సిబ్బంది సహాయంతో పోలీంగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form