Published on 

బీజాపూర్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో మరో 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్‌ ఉన్నారు. ఆయనపై రూ.3 కోట్ల రివార్డు ఉంది. రాంధెర్‌ ఎంఎంసీ(మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌) జోన్‌లో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు.

మిళింద్‌ తెల్టుంబే మరణించినప్పటి నుంచి రాంధెర్‌ ఎంఎంసీ బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన లొంగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులు నక్సల్స్‌ రహిత ప్రాంతాలుగా మారాయి. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పోలీసుల ఎదుట మావోయిస్టులు లొంగిపోతున్న సంగతి తెలిసిందే. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలు వున్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form