మే 10న ‘ప్రతినిధి-2’ విడుదల

Published on 

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన్న లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి-2’ను మే 10న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మూవీ మేకర్స్. పదేళ్ల క్రితం వచ్చిన ‘ప్రతినిధి’ సినిమాకు ఇది సీక్వెల్​. ఈ సినిమాను ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు తెరకెక్కించారు.

పొలిటికల్ బ్యాక్​డ్రాప్​గా రూపొందిన ఈ మూవీ కోసం మూవీలవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్​ చేశారు. ఇక రీసెంట్​గా మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా మార్చి 29న రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్​కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో హీరో రోహిత్ పవర్​ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.

టీజర్​లో నారా రోహిత్ చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ‘రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడుంది?’, ‘ఒళ్లు వంచి బయటకు వచ్చి ఓటు వేయండి, లేదంటే దేశం విడిచి వెళ్లిపోండి. అదీ కూదరకపోతే చచ్చిపోండి’ లాంటి డైలాగ్స్​ టీజర్​లో హైలైట్​గా నిలిచాయి. దీంతో పూర్తిగా రాజకీయ అంశాలతో సినిమా ఇంట్రస్టింగ్​గా ఉండనుందని ఆడియెన్స్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form