నేడు మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్

Published on 

కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తునకు ఏర్పాటైన జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. బ్యారేజీని పరిశీలించిన అనంతరం ఆయన రాత్రి రామగుండంలో బస చేయనున్నారు.

8న రామగుండం నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఈ నెల 9న ఆయన నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై న్యాయవిచారణకు సంబంధించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. బ్యారేజీల నిర్మాణం విషయంలో నిర్ణయాల్లో భాగస్వాములైన అధికారులు, ప్రజాప్రతినిధులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేసే అంశానికి సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form