నేడు తెలంగాణకు అమిత్ షా

Published on 

మూడు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొననున్న అమిత్ షా

కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో ప్రచారం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హెూంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లలొ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టనున్నారు. మూడు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.

ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1:55 గంటలకు బేగంపేటకు అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ వెళ్లనున్నారు. అక్కడి ఎస్పీఎం క్రికెట్ గ్రౌండ్లో మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4 గంటల దాకా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

సాయంత్రం 4:15 గంటలకు కాగజ్‌నగర్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 5 గంటలకు నిజామాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం 5:10 గంటల నుంచి 5:50 గంటల వరకు నిజామాబాద్‌లోని గిరిరాజ్ కాలేజీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 6:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు.

సాయంత్రం 6:45 గంటలనుంచి రాత్రి 7:30 గంటల దాకా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ
సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7:55 నిమిషాలకు బేగంపేట నుంచి పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్‌కు బయలుదేరనున్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form